PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రాష్ట్రస్థాయి సాఫ్ట్​ బాల్​ పోటీలకు మమత ఎంపిక

1 min read

అభినందించిన డి పౌలు హై స్కూల్ ప్రిన్సిపల్  ఫాదర్ జై సన్

ఆత్మకూరు: నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణం కరివేన    గ్రామంలో ఉన్నటువంటి డి పౌలు హై స్కూల్  ఫాదర్ జైసన్   మాట్లాడుతూ స్కూల్ గేమ్ ఫెడరేషన్ విభాగంలో   అండర్ 17 విభాగంలో  రాష్ట్రస్థాయి  సాఫ్ట్ బాల్ పోటీల్లో  పి,మమత   ఎంపికైనట్లు డి పౌలు స్కూల్ ఫాదర్  జై సన్  తెలిపారు,  అనంతరం ఈ క్రీడా రాణి ఈనెల 4 నుంచి 6వ తేదీ వరకు  ఒంగోలులో జరగబోయే  రాష్ట్రస్థాయి సాఫ్ట్ బల్ ఛాంపియన్ షిప్ లో పాల్గొంటుందని వెల్లడించారు, జిల్లాస్థాయిలో మంచి ప్రతిభను గనపరచి రాష్ట్రస్థాయి సాఫ్ట్బాల్ పోటీలకు ఎంపికైనటువంటి  పి.మమతను డి పౌలు హైస్కూల్  ప్రిన్సిపల్   జై సన్ స్కూల్ సమక్షంలో  అభినందించి, జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని   సాఫ్ట్బాల్ క్రీడకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి క్రీడలకు ఎంతగానో కృషి చేస్తున్నటువంటి    పీ ఈ టీ నాగేంద్రను జాతీయస్థాయిలో  క్రీడాకారులు ఎదిగే   విధంగా  కృషి చేయాలని   చదువుతోపాటు క్రీడలు ఎంతో అవసరమని    డి పౌలు హైస్కూల్ ప్రిన్సిపల్ ఫాదర్ జైసన్   మాట్లాడారు.

About Author