PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రాష్ట్ర సాహిత్య అకాడమి చైర్మన్ పిల్లంగోళ్ళ శ్రీలక్ష్మికి పితృవియోగం

1 min read

– కుటుంబీకులను పరామర్శించిన దెందులూరు ఎమ్మెల్యే కొట్టారు అబ్బయ్య చౌదరి
పల్లెవెలుగు వెబ్​, ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు కాంగ్రెస్ మున్సిపల్ వైస్ చైర్మన్ మరియు రాష్ట్ర అఖిల భారత యాదవ సంఘం అధ్యక్షులు పిల్లం గోళ్ళ రంగారావు యాదవ్ అనారోగ్య కారణంగా గురువారం మరణించినట్లు కుటుంబ సభ్యులకు తెలిపారు. పిల్లంగోళ్ల రంగారావు మరణ వార్త తెలుసుకున్న దెందులూరు ఎమ్మెల్యే కొట్టారు అబ్బయ్య చౌదరి ఇంటికి వెళ్లి బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. రంగారావు మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. రంగారావుకు నలుగురు సంతానం. పెద్ద కుమార్తె శ్రీలక్ష్మి, రెండో కుమార్తె 7వ డివిజన్ వైసిపి కార్పొరేటర్ గా పని చేస్తున్నారు. మూడవ, నాల్గవ కుమార్తెలు గృహిణి గా ఉన్నారు.
గరం.. పెద్దదిక్కును కోల్పోయింది…
రంగారావుకు దివంగత రాష్ట్ర మాజీ మంత్రి కోటగిరి విద్యాధర రావుతో మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. గంభీరమైన స్వరం, ప్రత్యేక శైలితో అందరి ఆదరాభిమానాలు పొందారు. జిల్లా వ్యాప్తంగా వ్యాపారవేత్తగా వ్యవహరిస్తూ వన్ టౌన్ లో చందనా బ్రదర్స్ కాంప్లెక్స్ యాజమాని గాఏలూరు నగరంలోని మంచి పేరు గాంచారు. నలుగురు కుమార్తెలు తండ్రి భౌతిక కాయాన్ని మోసి.. దహన సంస్కారాలు చేసిన సన్నివేశం చూసిన ప్రతిఒక్కరూ కన్నీటి పర్యంతమయ్యారు. నగరం పెద్దదిక్కు కోల్పోయిందంటూ ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. నగరంలో వ్యాపారవేత్తలు,కాంగ్రెస్ పార్టీ నాయకులు,వైసీపీ నాయకులు,యాదవ సంఘం నాయకులు తదితరులు దహన సంస్కార కార్యక్రమంలో పాల్గొన్నారు.

About Author