PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

బీసీలకు రాజ్యాధికారం టిడిపి తోనే సాధ్యం..

1 min read

టిడిపి మాజీ ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి..

పల్లెవెలుగు వెబ్ గడివేముల: గడివేముల మండలంలో బుధవారం నాడు జయహో బిసి మండల సభను టిడిపి గడివేముల కన్వీనర్ దేశం సత్యనారాయణరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా బీసీలకు పెద్దపీట వేసిన టిడిపి పార్టీని అందరు కలిసి ఎన్నికల్లో గెలిపించుకోవాలని పాణ్యం టిడిపి ఇన్చార్జి గౌరు చరిత రెడ్డి కోరారు. పాణ్యం లో అత్యధిక మెజార్టీతో పట్టం కట్టాలని. ఈసారి టిడిపి ప్రభుత్వం వస్తే వెలగమను డ్యాం. అలగనూరు రిజర్వాయర్ మరమ్మత్తు. గడివేముల గ్రామ ప్రజల చిరకాల వాంఛ బైపాస్ ను మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. గౌరు వెంకటరెడ్డి మాట్లాడుతూ. వైసీపీ ప్రభుత్వ హయాంలో మాట తప్పను మడమ తిప్పను అన్న జగన్ మోహన్ రెడ్డి వారంలోని సిపిఎస్ రద్దు చేస్తానని చెప్పి మాట తప్పారని. అంగన్వాడీలకు తెలంగాణలో ఇస్తున్న వేతనం కంటే అదనంగా వేయి రూపాయలు ఇస్తానని మాట తప్పారని . కార్మికులకు ఇసుక లేకుండా చేశారని. నాయకులకు ప్రభుత్వ భూములు ఆక్రమించుకోవడానికి అవకాశం ఇచ్చారని . మద్యం ధరలను అమంతంగా పెంచి కల్తీ మద్యాన్ని అమ్ముతున్నారని. వైసిపి నాయకుల్లో వ్యతిరేకత పెరిగిందని అందుకు నిదర్శనంగా రెండు రోజుల్లో ఓర్వకల్లు మండలంలోని ఒక నాయకుడు తన ఆవేదనను వ్యక్తం చేశాడని మరికొన్ని రోజుల్లో ఇంకా ఎంతోమంది వైసిపి పార్టీని వీడనున్నారని తెలిపారు. మాండ్ర శివానందరెడ్డి మాట్లాడుతూ. టిడిపి జెండా మోసిన బిసి నాయకులకు ఈసారి టిడిపి అధికారంలో వచ్చిన వెంటనే వారి సంక్షేమానికి వారి రక్షణకు ప్రత్యేక చట్టం చేయాలని చంద్రబాబు నాయుడు ప్రత్యేక కార్యచరణ సిద్ధం చేసుకున్నారని ఈసారి తనను కూడా నంద్యాల పార్లమెంటుకు గౌరు చరితారెడ్డి పాణ్యం నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నామని ప్రజలందరూ ఆశీర్వదించాలని కోరారు   ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు నంద్యాల జిల్లా టిడిపి అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్. నంద్యాల పార్లమెంట్ టిడిపి ఇన్చార్జి మాండ్రా శివానందరెడ్డి. నందికొట్కూరు టిడిపి ఇన్చార్జి గౌరు వెంకట్ రెడ్డి. తెలుగుదేశం కార్యకర్తలు పాల్గొన్నారు.

About Author