NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

నెల్లూరులో స్టీల్ ప్లాంట్.. !

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : నెల్లూరులో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. త‌మ్మిన‌ప‌ట్నం-మోమిడి ప‌రిధిలో 7,500 కోట్లతో 11.6 మిలియ‌న్ టన్నుల సామ‌ర్థ్యంతో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయ‌నున్నారు. గ‌తంలో కిన్నెటా ప‌వ‌ర్ కు ఇచ్చిన భూముల‌ను ప్రభుత్వం ర‌ద్దు చేసి వాటి స్థానంలో జిందాల్ సంస్థకు కేటాయించింది. ఈ మేర‌కు జిందాల్ సంస్థకు 860 ఎక‌రాల భూమిని కేటాయిస్తు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. స్టీల్ ప్లాంట్ ఏర్పాటుతో 2500 మందికి ప్రత్యక్షంగా, 15 వేల మందికి ప‌రోక్షంగా ఉపాధి ల‌భించ‌నుంది. ప్లాంట్ విస్తర‌ణకు వ‌చ్చే నాలుగేళ్లలో 3వేల ఎక‌రాలు అవ‌స‌ర‌మ‌ని అధికారులు అంచ‌నా వేస్తున్నారు.

About Author