PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

న‌ష్టాల నుంచి లాభాల్లోకి స్టాక్ మార్కెట్

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలను ఉక్రెయిన్, ర‌ష్యా యుద్ధం వెంటాడుతోంది. ఉద‌యం న‌ష్టాల‌తో ప్రారంభ‌మై అనంత‌రం లాభాల్లోకి చేరాయి. ర‌ష్యా, ఉక్రెయిన్ మ‌ధ్య ఒక‌వైపు య‌ద్ధం సాగుతుండ‌గా.. మ‌రోవైపు శాంతి చ‌ర్చ‌లు కొన‌సాగుతున్నాయి. దీంతో స్టాక్ మార్కెట్ల‌లో అనిశ్చితి నెల‌కొంది. సూచీలు భారీగా ఒడిదుడుకుల‌కు లోన‌వుతున్నాయి. మెట‌ల్ సెక్టార్లో నెల‌కొన్న కొనుగోళ్ల ఒత్తిడితో సూచీల్లో లాభాలు క‌నిపిస్తున్నాయి. ఆటో, బ్యాంకింగ్ సెక్టార్ల‌లో అమ్మ‌కాల ఒత్తిడి నెల‌కొంది. 1:30 నిమిషాల స‌మ‌యంలో సెన్సెక్స్ 107 పాయింట్ల లాభంతో 55965 వ‌ద్ద‌, నిఫ్టీ 63 పాయింట్ల లాభంతో 16,722 వద్ద ట్రేడ్ అవుతోంది.

                                    

About Author