NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

అసదుద్దీన్ పై రాళ్ల దాడి

1 min read

పల్లెవెలుగువెబ్ : గుజరాత్ రాష్ట్రంలో పర్యటిస్తున్న ఆల్ ఇండియా మజ్లిస్ ఏ ఇత్తేహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) అధినేత అసదుద్దీన్ ఒవైసీపై రాళ్ల దాడి జరిగిందా? అంటే అవునంటున్నారు ఆ పార్టీ నాయకుడు వారిస్ పఠాన్. గుజరాత్ ఎన్నికల ప్రచారంలో భాగంగా అహ్మదాబాద్ నుంచి సూరత్న గరానికి వందేభారత్ రైలులో ప్రయాణిస్తున్న అసదుద్దీన్ ఒవైసీపై ఆగంతకులు రాళ్లతో దాడి చేశారని మజ్లిస్ నాయకుడు వారిస్ పఠాన్ ఆరోపించారు. వందేభారత్ రైలు సూరత్ నగరానికి 25 కిలోమీటర్ల దూరంలో నడుస్తుండగా అసదుద్దీన్ కూర్చున్న బోగీపై ఆగంతకులు రాళ్లు విసిరారని వారిస్ పఠాన్ సూరత్ ర్యాలీలో ఆరోపించారు.

About Author