PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

చంద్రబాబు కాన్వాయ్ పై రాళ్ళ దాడి వైసీపీ దుశ్చర్యలకు పరాకాష్ట

1 min read

– రాజకీయాల్లో భౌతిక దాడులు సరికాదు.
– వైసిపి రౌడీలకు భయపడే ప్రసక్తి లేదు.
– అరాచకాలపై పోరాటం చేస్తామని హెచ్చరించిన కాకరవాడ చిన్న.
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో రోడ్ షోకు వస్తున్న చంద్రబాబు కాన్వాయ్ పై రాళ్లు రువ్వడం వైసీపీ నేతల దుశ్ఛర్య లకు పరాకాష్ట అని నందికొట్కూరు టీడీపీ అధికార ప్రతినిధి కాకరవాడ చిన్న వెంటస్వామి అన్నారు. శనివారం నందికొట్కూరు పట్టణంలో టీడీపీ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. రాజకీయాల్లో భౌతిక దాడులకు దిగడం సరికాదని హెచ్చరించారు. చంద్రబాబు పై రాళ్ళ దాడి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దుశ్చర్యలకు పరాకాష్ట గా అభివర్ణించారు. ఇలాంటి ఘటనల జరగడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతిభద్రతల పర్యవేక్షణ లో పోలీసులు వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది అన్నారు. మాజీ ముఖ్యమంత్రి ప్రధాన ప్రతిపక్ష నేతకే రక్షణ లేకపోతే ఇక సామాన్య ప్రజలకు ఆంధ్రప్రదేశ్ లో రక్షణ ఎక్కడ ఉంటుంది అని అన్నారు. మంత్రి ఆదిమూలం సురేష్ ఇలాంటి దాడులకు తెగబడ్డారు అంటే వెనుక జగన్మోహన్ రెడ్డి పాత్ర ఖచ్చితంగా ఉండవచ్చు అన్నారు. చంద్రబాబు సెక్యూరిటీలోని ఎన్ఎస్జి కమాండెంట్ సంతోష్ కుమార్ తలకు గాయమైందని, దీనిబట్టి పోలీసుల భద్రత ఎంత వైఫల్యం ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. వైసిపి రౌడీలకు భయపడే ప్రసక్తి లేదన్నారు. రాష్ట్రంలో వైసిపి మూకలు చేస్తున్న అరాచకాలపై చంద్రబాబు నాయకత్వంలో పోరాటం చేస్తామన్నారు. చంద్రబాబు కాన్వాయ్ వరకు వైసిపి అల్లరి మూకలను పోలీసులు రానివ్వడాన్ని బట్టి రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి ఏ విధంగా ఉందో తెలుస్తోందన్నారు. సమావేశంలో టీడీపీ పట్టణ ఎస్సి సెల్ నాయకులు బొల్లెద్దుల చిన్న రాజన్న, బిసి పట్టణ అధ్యక్షుడు వేణుగోపాల్, జూపాడుబంగ్లా మండల బిసి సెల్ నాయకులు సంపత్ కుమార్ యాదవ్, టీడీపీ నాయకులు కళాకర్ , తదితరులు పాల్గొన్నారు.

About Author