PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

విశాల్ ఇంటి పై రాళ్ల దాడి

1 min read

ప‌ల్లెవెలుగువెబ్: తాజాగా విశాల్ ఇంటిపై గుర్తు తెలియని కొందరు దుండగులు రాళ్లతో దాడి చేశారు. దీంతో ఆయన ఇంటి అద్దాలు ధ్వంసమయ్యాయి. ప్రస్తుతం ఈ ఘటన తమిళనాడు సినీ, రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీసింది. విశాల్ గత కొంతకాలంలో చెన్నైలోని అన్నా నగర్‌లో తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నాడు. ఈ క్రమంలోని కొందరూ వ్యక్తులు ఎరుపు రంగు కారులో వచ్చి విశాల్ ఇంటిపై రాళ్ల దాడి చేశారు. దుండగులు దాడి చేస్తున్న సమయంలో విశాల్ ఇంట్లో లేడని తెలుస్తోంది. అయితే.. కారు విషయాన్ని సీసీటీవీ ఫుటేజీ ద్వారా తెలుసుకున్న విశాల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో సినీ పరిశ్రమలో విశాల్ అంటే పడనివారే ఇలా చేశారా.. లేక ఇతర కారణాలు ఏమైన ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.

                               

About Author