PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఆనంద‌య్య క‌రోన మందు పంపిణీ ఆపండి..!

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండ‌లం కృష్ణప‌ట్నానికి చెందిన ఆనంద‌య్య పంపిణీ చేస్తున్న క‌రోన మందును ఆపాల‌ని జ‌న‌విజ్ఞాన వేదిక‌, ప్రజారోగ్య సంస్థలు కోరాయి. సంస్థ ప్రతినిధులు విఠ‌పు బాల సుబ్రమ‌ణ్యం, డాక్టర్ ర‌మ‌ణ‌య్యలు మాట్లాడుతూ ఆనంద‌య్య పంపిణీ చేస్తున్న క‌రోన మందు శాస్త్రీయ‌త‌, సామ‌ర్థ్యం నిరూప‌ణ అయ్యేంత వ‌రకు పంపిణీ ఆపాలని అన్నారు. వీలైనంత త్వరగా ఆయుష్, ఐసీఎంఆర్ అధికారులు మందును ప‌రిశీలించి ఫ‌లితాలు వెల్లడించాల‌ని కోరారు. కోవిడ్ నిబంధ‌న‌లు పాటించ‌కుండా పంపిణీ చేయ‌డంతో మ‌రిన్ని కోవిడ్ కేసులు రావ‌డానికి కార‌ణ‌మ‌య్యార‌ని విమ‌ర్శించారు. ప్రజ‌లు కూడ క‌రోన మందు సామ‌ర్థ్యం, శాస్త్రీయ‌త నిర్దార‌ణ అయ్యే వ‌ర‌కు సంయంమ‌నం పాటించాల‌ని కోరారు.

About Author