PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అక్రమ అరెస్టులు ఆపి..ప్రజల్ని కాపాడండి: లోకేష్

1 min read

పల్లెవెలుగు వెబ్ : జగన్ చేత‌గాని పాల‌న‌కి నిన్న రుయాలో ఆక్సిజ‌న్ అంద‌క ప‌దుల‌ సంఖ్యలో కోవిడ్ పేషెంట్ల ఊపిరి ఆగిపోయిందని , ఈ రోజు అనంత‌పురం ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యం అంద‌క చూస్తుండ‌గానే ఆరుగురు కరోనా రోగులు ఆవ‌ర‌ణ‌లోనే కుప్పకూలిపోయారని టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ విరుచుకుపడ్డారు. ‘క‌ళ్లముందే ప్రజ‌ల‌ ప్రాణాలు పోతుంటే క‌న్నీళ్లు ఆగ‌డంలేదు. వీరి ప్రాణాలు పోవ‌డానికి కూడా తమిళనాడు నుంచి ఆక్సిజ‌న్ ట్యాంకర్లు రాకపోవడం కారణం అంటారా జగన్ ’ అని నారా లోకేష్ ఎద్దేవా చేశారు. జగనన్న మూర్ఖత్వానికి, అరాచ‌క‌పాల‌న‌కి రోజూ వంద‌లాది మంది బ‌ల‌వుతున్నారని విమర్శించారు. చూపించేది సొంత మీడియా అయితే రికార్డెడ్ ప్రెస్‌మీట్ కూడా లైవ్ అని వేసుకోగ‌లరని.. ఇంకా చంద్రబాబు మీద ఏడుపు, టిడిపి నేత‌ల అక్రమ అరెస్టులు ఆపి..జ‌నాల ప్రాణాలు కాపాడే ప‌ని చూడండి అంటూ హితవు పలికారు.

About Author