NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

శ్రీశైలం విద్యుత్ ఉత్ప‌త్తి ఆపండి !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్: తెలుగు రాష్ట్రాల మ‌ధ్య మ‌రో వివాదం రేకెత్తింది. శ్రీశైలం ఎడ‌మ‌గ‌ట్టు కాల్వ‌పై తెలంగాణ విద్యుదు‌త్ప‌త్తి చేప‌డుతోంద‌ని ఏపీ జ‌ల‌వ‌న‌రుల శాఖ ఆరోపించింది. సాగు, తాగు నీటి అవ‌స‌రాల నేప‌థ్యంలో తెలంగాణ విద్యుదుత్ప‌త్తిని త‌క్ష‌ణ‌మే నిలుపుద‌ల చేయించాల‌ని కోరుతూ ఏపీ జ‌ల‌వ‌న‌రుల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ (ఈఎన్‌సీ) కృష్ణా న‌ది నీటి యాజ‌మాన్య బోర్డు (కేఆర్ఎంబీ)కి లేఖ రాశారు. ప్రస్తుతం శ్రీశైలంతో పాటు నాగార్జున సాగ‌ర్‌లోనూ పూర్తి స్థాయి నీటి మ‌ట్టం ఉంద‌ని, అయితే ఇప్ప‌టికిప్పుడు విద్యుదుత్పాద‌న చేప‌డితే ఖ‌రీఫ్ చివ‌రిలో సాగు నీటితో పాటు తాగు నీటికి కూడా ఇబ్బంది ఎదురు కానుంద‌ని ఏపీ ఈఎన్‌సీ త‌న లేఖలో పేర్కొన్నారు.

                                     

About Author