PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నిలిచిపోనున్న ఎస్బీఐ ఆన్ లైన్ బ్యాంకింగ్ సేవలు !

1 min read

పల్లెవెలుగువెబ్ : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక ప్రకటన చేసింది. ఎస్బీఐకి చెందిన ఆన్ లైన్ బ్యాంకింగ్ సేవలు జనవరి 22న కొన్ని గంటలపాటు నిలిచిపోనున్నాయని కస్టమర్లకు తెలిపింది. టెక్నాలజీ అప్ గ్రేడేషన్ లో భాగంగా జనవరి 22 ఉదయం 2 గంటల నుంచి ఉదయం 8 గంటల 30 నిమిషాల వరకు సేవలకు అంతరాయం ఏర్పడనుంది. ఆ సమయంలో ఎస్బీఐ ఇంటర్నెట్ బ్యాంకింగ్, యోనో, యోనో లైట్, యోనో బిజినెస్, యూపీఐ సేవలకు అంతరాయం ఏర్పడనుందని ఎస్బీఐ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో ప్రకటించింది. వినియోగదారులు ఈ విషయాన్ని గమనించాలని తెలిపింది.

          

About Author