PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

లైసెన్సు లేకుండా వాహనాలు నడిపితే కఠిన చర్యలు : ​ సీఐ నరసింహారెడ్డి

1 min read

పల్లెవెలుగు వెబ్​, రాయచోటి: లైసెన్సు లేకుండా వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని రాయచోటి అర్బన్ సి ఐ నరసింహా రెడ్డిహెచ్చరించారు. శుక్రవారం స్థానిక పోలీసుస్టేషన్లో పలువురు తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మైనర్ పిల్లలు వాహనాలు నడిపితే  అ బాధ్యతవారి తల్లిదండ్రులదేనన్నారు.నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు నడిపితే కేసులు నమోదు చేస్తామన్నారు. ప్రతిఒక్కరూ ఈ విషయం గమనించి పోలీసులకు సహకరించాలన్నారు. అదేవిధంగాప్రస్తుత పరిస్థితుల్లో కరోనా విజృంభిస్తున్న కారణంగా ప్రతిఒక్కరూ మాస్కులు ధరించాలన్నారు. లేనియెడల జరిమానా విధించి కేసులు నమోదు చేస్తామన్నారు. శుక్రవారం మైనర్ డ్రైవింగ్, త్రిబుల్ రైడింగ్, తదితర 52 వాహనాలపై రూ:13,430 లు విధించినట్లు ఆయన తెలిపారు. ఈకార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్ ఐ రమేష్ బాబు,హెడ్ కానిస్టేబుల్, వేణు నాయక్,చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

About Author