NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

విధుల్లో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు

1 min read

– మీకు ఇచ్చిన లక్ష్యాలను పూర్తి చేయాల్సిందే:డ్వామా పీడి
పల్లెవెలుగు వెబ్ మిడుతూరు: విధుల్లో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని అంతేకాకుండా ఉపాధి పనుల్లో మీకు ఇచ్చిన లక్ష్యాలను పూర్తి చేయకపోతే కఠినంగా వ్యవహరించాల్సి ఉంటుందని ఉపాధి సిబ్బంది టెక్నికల్ అసిస్టెంట్లు మరియు ఫీల్డ్ అసిస్టెంట్లను నంద్యాల జిల్లా డ్వామా ప్రాజెక్టు డైరెక్టర్ రామచంద్ర రెడ్డి అన్నారు.మంగళవారం మధ్యాహ్నం మిడుతూరు మండల పరిషత్ కార్యాలయంలో ఉపాధి సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు.గ్రామాల్లో వెంటనే ఉపాధి పనులు మొదలుపెట్టాలని,కూలీల సంఖ్యను రోజురోజుకు పెంచాలన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో జిఎన్ఎస్ రెడ్డి,ఏపీఓ జయంతి,ఈసీ నరేష్,టెక్నికల్ అసిస్టెంట్లు మరియు ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.

About Author