PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఇసుక అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవు: సి ఐ లింగప్ప

1 min read

పల్లెవెలుగు అన్నమయ్య జిల్లా రాయచోటి : ఇసుక అక్రమ రవాణాచేస్తే కఠిన చర్యలు తప్పవని రాయచోటి రూరల్ సి ఐ లింగప్ప పేర్కొన్నారు. ఆదివారం రాయచోటి రూరల్  పరిధిలోని వండాడి గ్రామం తూర్పుపల్లి క్రాస్ వద్ద  ఇసుక అక్రమ రవాణా చేస్తున్న వారిపై దాడులు నిర్వహించి 3 ట్రాక్టర్లు సీజ్ చేయడంతో పాటు కేసులు  నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న నదులు, వంకలు, వాగులలో ఇసుకను అక్రమంగా తరలిస్తున్నట్లయితే స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. అదేవిధంగా చెరువులు, కుంటలలో మట్టిని అక్రమంగా రవాణా చేసినా ట్రాక్టర్లు సీజ్ చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పోలీసుసిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

About Author