PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

7 నుంచి సమ్మె.. నోటీసు అందజేసిన ‘హిందూ ఉపాధ్యాయ సమితి’

1 min read

పల్లెవెలుగు వెబ్​, కర్నూలు: PRC సాధన సమితి పిలుపు మేరకు ఈ నెల 7 వ తేదీ నుండి సమ్మె లో పాల్గొంటున్నట్లు సమ్మె నోటీసులను శనివారం ఎంఈఓ మౌలాలికి అందజేశారు హిందూ ఉపాధ్యాయ సమితి సభ్యులు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కురువ చంద్రశేఖర్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా  ఉపాధ్యాయులు అందరూ వారి వారి ddo లకు సమ్మె నోటీసు లు అందచేసి 7వ తేదీ నుండి సమ్మెలో చురుకుగా పాల్గొని మన సమస్యలు పరిష్కారం అయ్యేవరకు మొక్కవోని  ధీక్షా దక్షతతో  ప్రభుత్వానికి మన నిరసనను, సంఘటిత శక్తి ని  తెలిచేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో హిందూ ఉపాధ్యాయ సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ కురువ చంద్రశేఖర్, కర్నూలు జిల్లా  ప్రధాన కార్యదర్శి శ్రీ విశ్వేశ్వరప్ప, కార్యదర్శి శ్రీ శ్రావణ్ కుమార్,ప్రధానోపాధ్యాయులు శ్రీ గోవిందరాజులు, శ్రీ సత్యనారాయణ, శ్రీ మహమ్మద్ వలి , శ్రీ దర్వేశ్ తదితరులు పాల్గొన్నారు.

About Author