PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జాతీయ ప్రతిభా స్కాలర్ షిప్ కు విద్యార్థిని ఎంపిక

1 min read

NMMS పరీక్షల లో సత్తా చాటిన సంబేపల్లి హై స్కూల్ విద్యార్థిని
పల్లెవెలుగు వెబ్​, రాయచోటి: కడప జిల్లా రాయచోటి నియోజకవర్గ కేంద్రంలోని సంబేపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న అనంత గాయత్రి అనే విద్యార్థిని జాతీయ ప్రతిభాన్వేషణ పరీక్షలలో (NMMS) ప్రతిభ కనబరచి జాతీయ ప్రతిభా స్కాలర్షిప్ కు ఎంపికయ్యారు. ఈ విషయం పాఠశాల ప్రధానోపాధ్యాయులు మడితాటి నరసింహా రెడ్డి స్పష్టం చేశారు. ప్రతిభా స్కాలర్షిప్ కు ఎంపికైన పేదింటి బిడ్డ గాయత్రిని ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు ఈ సందర్భంగా అభినందించారు. స్కాలర్ షిప్ కు ఎంపికైన విద్యార్థులకు సంవత్సరమునకు 12 వేల చొప్పున 5 సంవత్సరాలపాటు స్కాలర్షిప్ అందిస్తారని ఆయన తెలిపారు.

About Author