NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

క‌డ‌ప‌లో స్టుడెంట్ వార్ !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : క‌డ‌ప న‌గ‌రంలోని కేఓఆర్‌ఎం ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ ఫస్టియర్ విద్యార్ధి శివ ప్రసాద్‌పై ఫైనలియర్ విద్యార్థులు దాడికి దిగారు. దాడికి పాల్పడిన ముగ్గురు విద్యార్థులను అరెస్ట్ చేశారు. మరో ఇద్దరు విద్యార్థులు పరారీలో ఉన్నారు. పరారైన విద్యార్థుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. వీరి వద్ద నుంచి ఒక కత్తిని స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా కడప డీఎస్పీ వెంకట శివారెడ్డి మాట్లాడుతూ.. విద్యాలయాల్లో చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడితే ఉపేక్షించేది లేదన్నారు. చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవన్నారు. విద్యార్థులు చెడు వ్యసనాలకు బానిసలుగా మారవద్దన్నారు. క్రిమినల్ కేసుల్లో ముద్దాయిలు అయితే విద్యార్థుల పాస్ పోర్ట్‌లు నిరాకరించి, విదేశీవిద్య, ప్రభుత్వ ఉద్యోగులకు అనర్హులు అవుతారన్నారు.

                                           

About Author