NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

స్కూలుకెళ్లి కుప్పకూలుతున్న విద్యార్థులు

1 min read

పల్లెవెలుగువెబ్ : కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి హైస్కూల్లో స్పెషల్ క్లాసు కోసం వెళ్లిన ఏడుగురు విద్యార్థినులు కుప్పకూలిపోవడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. వారు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడడంతో వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇక్కడి విద్యార్థినులు ఉన్నట్టుండి కుప్పకూలడం ఇదే తొలిసారి కాదు. ఇరవై రోజుల కిందట ఓ బాలిక ఇలాగే కళ్లు తిరిగి పడిపోయింది. గత రాత్రి కూడా పలువురు విద్యార్థినులు ఇలాగే అస్వస్థతకు గురయ్యారు. నేడు ఏకంగా ఏడుగురు విద్యార్థినులు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతూ అపస్మారక స్థితిలోకి వెళ్లారు. విద్యార్థినులు ఈవిధంగా కళ్లు తిరిగి పడిపోతుండడం ఒక మిస్టరీగా మారింది. దాంతో విద్యార్థినులు, తల్లిదండ్రులు భయాందోళనలకు గురవుతున్నారు.

About Author