NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

విద్యార్థులకు…‘ట్రాఫిక్​’ పై అవగాహన

1 min read

ట్రాఫిక్​ నియమాలు వివరించిన డీఎస్పీ నాగభూషణం

పల్లెవెలుగు: విద్యార్థులు ట్రాఫిక్​ నియమాలపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు కర్నూల్ ట్రాఫిక్ డిఎస్పి నాగభూషణం. మంగళవారం నగరంలోని Mother Teresa institute of pharmaceutical education and research miper కాలేజ్ లో స్టూడెంట్స్ కు  ట్రాఫిక్ నియమాలపై ప్రొజెక్టర్ ద్వారా అవగాహన కార్యక్రమం నిర్వహించారు.  ఈ సందర్భంగా ట్రాఫిక్ డిఎస్పి నాగభూషణం మాట్లాడుతూ లైసెన్స్ లేని విద్యార్థులు వాహనాలు నడపరాదని,  ఏదైనా యాక్సిడెంట్ చేస్తే A1 ముద్దాయిగా పోలీస్ కేసులో ఇరుక్కుంటారని  పోలీస్ కేసులలో ఉన్న స్టూడెంట్స్కు ఎలాంటి గవర్నమెంట్ ఉద్యోగాలు రావని ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమ నిబంధనలు, పాటిస్తూ ట్రాఫిక్ రూల్స్ పాటించాలని సూచించారు. స్నేక్ డ్రైవింగ్,రాంగ్ రూటు, సెల్ ఫోన్ డ్రైవింగ్ , త్రిబుల్ రైడింగ్ , అతివేగంగా వాహనాలు నడపరాదని, ఇన్సూరెన్స్ లేని ఎలాంటి వాహనాలు కూడా నడపరాదని , హెల్మెట్​  ధరించి వాహనం నడపాలని , పాదచారులు ఎక్కడ పడితే అక్కడ  రోడ్డు క్రాస్ చేయకూడదని జీబ్రా లైన్స్ దగ్గరే రోడ్స్ క్రాస్ చేయాలని వెల్లడించారు. అలాగే కాలేజ్ లో లైసెన్స్ లేని స్టూడెంట్స్కు వాహనాలు నడపటానికి అనుమతి ఇవ్వకూడదని స్టూడెంట్స్ కి కాలేజీ లో అలోవ్ చేయొద్దని  ప్రిన్సిపాల్ కు మరియు లెక్చరర్స్   కు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ డిఎస్పి నాగభూషణం మరియు కాలేజీ మరియు ట్రాఫిక్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

About Author