PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

విద్యార్థులు క్రమశిక్షణను అలవర్చుకోవాలి…

1 min read

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: చిన్నతనం నుంచే విద్యార్థులు క్రమశిక్షణ అలవర్చుకోవాలని మండల విద్యాధికారి పై జున్నిసా బేగం  తెలిపారు. సోమవారం  నారాయణ పాఠశాలలో విద్యార్థులకు క్యాబినెట్ ఎలక్షన్స్ ఇన్సట్ లేషన్  కార్యక్రమాన్ని నిర్వహించినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మండల విద్యాధికారి ఫైజున్నిసా బేగం హాజరయ్యారు.  అనంతరం ఆమె మాట్లాడుతూ విద్యార్థులు చదువులో రాణించి ఉన్నత విద్యను అభ్యసించాలని ఆమె సూచించారు. అనంతరం  క్యాబినెట్ ఎలక్షన్స్ లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థి జహీర్ అలీ ని అభినందించారు. ఈ కార్యక్రమంలో విద్యాధికారి శ్రీనివాసులు, పాఠశాల ఏవో మహేష్, జోనల్ కోఆర్డినేటర్ శివకుమార్ రెడ్డి, దివ్య తేజ, ఉపాధ్యాయిని  ఆశా పర్వీన్,తదితరులు పాల్గొన్నారు.

About Author