NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

విజయవంతంగా  ఎన్.సి.డి  3.0  సర్వే పై  లాట్ క్వాలిటీ అసెస్మెంట్ “..

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:  జిల్లాలోని అయిదు గ్రామాల్లో విజయవంతంగా  నాన్ కమ్యునకబుల్ వ్యాధుల 3.0 సర్వే  పై విజయవంతంగా క్వాలిటీ అసెస్మెంట్ సర్వే నిర్వహించామని కమ్యూనిటీ మెడిసిన్ విభాగపు అధిపతి డాక్టర్ సుధా కుమారి, ప్రొఫెసర్ సింధియా శుభప్రదలు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. గౌరవ ప్రిన్సిపల్ సెక్రెటరీ డి.ఎం.ఈ గారి ఆదేశాల మేరకు మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ కే చిట్టి నరసమ్మ గారి సూచనలు సలహాలతో  కమ్యూనిటీ మెడిషన్ విభాగం ఆధ్వర్యంలో  జిల్లాలోని ఐదు గ్రామాల్లో జిల్లాలో ఐదు మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఏడు మంది పీజీలు 50 మంది ఇంటర్న్స్ వైద్యుల బృందం ఆధ్వర్యంలో లాట్ క్వాలిటీ అసెస్మెంట్ సర్వే నిర్వహించడం జరిగిందని తెలిపారు. గతంలోనే నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ 3.ఓ సర్వే జరిగిన విధానాన్ని ఎంత మేరకు సమర్థవంతంగా నిర్వహించడం జరిగింది అన్న దానిపై క్వాలిటీ అసెస్మెంట్ చేశామని వారు తెలిపారు. జిల్లాలోని బుక్కాపురం,గోరంట్ల, సి.బెళగల్ చింత మాన్ పల్లి, ఆరెకల్ మాచాపురం గ్రామాల్లో రాండంగా 600 శాంపిల్స్ అసెస్మెంట్ కొరకు ఎంపిక చేసుకోవడం జరిగిందని గ్రామాల్లో వారి ఇళ్ల వద్దకు వెళ్లి వైద్య బృందం మళ్లీ పరీక్షలు చేసి గతంలో జరిగిన సర్వేపై అసెస్మెంట్ చేయడం జరిగిందని తెలిపారు. క్వాలిటీ అసెస్మెంట్ సర్వే పై కూడా మళ్లీ అసోసియేట్ ప్రొఫెసర్ల ఆధ్వర్యంలో పర్యవేక్షణ చేయించడం జరిగిందని తెలిపారు. సేకరించిన 600 వందల శాంపిల్స్ ను విశ్లేషణ చేసి పై అధికారులకి  నివేదిక అందిస్తామని వారు తెలిపారు. ఈ సర్వేలో అసోసియేట్ ప్రొఫెసర్లు డా. అరుణ డా. రేణుక, అసిస్టెంట్ ప్రొఫెసర్లు డా. పుష్పలత డా. ప్రవీణ డా. వైష్ణవి, డాక్టర్ ప్రసన్న రాణి లెక్చరర్ సురేష్ కుమార్, సూపర్ వైజర్ సాయిరాం, పీజీలు డా.అపర్ణ డా. మౌనిక, డా. నర్మద డా. కార్తీక్, డా.సబిహ డా. సౌమ్య డా. నస్రత్ లు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *