PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఆర్యవైశ్య మహాసభ జిల్లా ఉపాధ్యక్షుడిగా సుధీంద్ర

1 min read

పల్లెవెలుగు వెబ్​, వెల్దుర్తి : ఆర్యవైశ్య జిల్లా మహాసభ ఉపాధ్యక్షులుగా వెల్దుర్తికి చెందిన వెంకట సుధీంద్ర ను ఎంపికయ్యారు. శనివారం నందికొట్కూరులోని అమ్మవారిశాల లో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయన ను ఎంపిక చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథులుగా రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ హాజరైనట్లు తెలిపారు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి రాష్ట్ర నాయకులు సత్యనారాయణ, ఇల్లూరు సుధాకర్ తో పాటు పలువురు హాజరైనట్లు తెలిపారు. అనంతరం జరిగిన సమావేశంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలిపారు. రాష్ట్ర సంఘం తనకు ఇచ్చిన ఈ పదవిని ఆర్యవైశ్యుల అభివృద్ధి కోసం ఉపయోగిస్తానని వారి అభ్యున్నతికి పాటు పడతానని ఈ సందర్భంగా తిరువీధి వెంకట సుధీంద్ర విలేకరులతో అన్నారు. ఈయన ఎంపిక పట్ల వెల్దుర్తి కి చెందిన పలువురు ఆర్యవైశ్యులు హర్షం వ్యక్తం చేశారు.

About Author