PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నొప్పి లేకుండా షుగ‌ర్ చెక‌ప్ !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్: మధుమేహ బాధితులు నిత్యం ఎదుర్కొనే రెండు ప్రధాన సమస్యల్లో ఒకటి షుగర్‌ చెక్‌ చేసుకోవడం. రెండోది ఇన్సులిన్‌ ఇంజెక్షన్‌. రక్తంలో చక్కెర స్థాయులు తెలుసుకోవడానికి రోజూ చిన్నపాటి సూదిలాంటి పరికరంతో వేలిపై పొడిచి, రక్తపు బొట్టు గ్లూకోమీటర్‌ స్ట్రిప్‌పై వేయాల్సి ఉంటుంది! చిన్నప్పుడు తన తండ్రి రోజూ ఇలాగే షుగర్‌ చెక్‌ చేసుకుని బాధపడుతుండడం చూసిన మరియా వాలెరో అనే శాస్త్రవేత్త.. అలాంటి బాధ ఇతరులు పడకుండా ఉండేలా ‘గ్లూకోచెక్‌’ అనే కొత్త పరికరాన్ని అభివృద్ధి చేశారు. జార్జియాలోని కెన్నెసా స్టేట్స్‌ కాలేజ్‌ ఆఫ్‌ కంప్యూటింగ్‌ అండ్‌ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీరింగ్‌కి చెందిన వాలెరో, ఆమె బృందం తయారుచేసిన ఈ పరికరాన్ని వేలికి తగిలించుకుంటే చాలు 90 శాతం కచ్చితత్వంతో రక్తంలో చక్కెర స్థాయులను తెలుపుతుంది. ట్రయల్స్‌లో భాగంగా 50 మంది మీదే పరీక్షించినందున.. ఈ పరికరానికి ప్రొవిజనల్‌ పేటెంట్‌ కోసం వాలెరో ఇటీవలే దరఖాస్తు చేశారు.

                                                   

About Author