PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఆత్మాహుతి దాడి.. 25 మంది మృతి

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : తాలిబన్‌ పాలిత ఆప్ఘనిస్తాన్‌లో​ కొద్దిరోజులుగా వరుస బాంబు పేలుళ్లు చోటుచేసుకుంటున్నాయి. సోమవారం కాబూల్‌లో భారీ బాంబ్‌ బ్లాస్ట్‌ జరిగింది. ఈ ప్రమాదంలో దాదాపు 25 మందికిపైగా మృతి చెందినట్టు ఆ దేశ మీడియాలో ఓ ప్రకటనలో పేర్కొంది. కాబూల్‌లోని రష్యా రాయబార కార్యాలయం సమీపంలో సోమవారం బాంబ్‌ బ్లాస్ట్‌ ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి ఆత్మాహుతి దాడి కారణంగా బ్లాస్ట్‌ జరిగింది. సదరు వ్యక్తి రష్యా రాయబార కార్యాలయంలోని ప్రవేశించి లక్ష్యాన్ని చేరుకోవడానికి ముందే ఆత్మాహుతి దాడి చేసిన వ్యక్తిని తాలిబాన్ గార్డులు గుర్తించి కాల్చిచంపినట్టు పోలీసు అధికారి మవ్లావి సాబిర్ తెలిపారు. కాగా, ఈ పేలుడు ఘటనలో దాదాపు 25 మందికిపైగా మృతి చెందినట్లు సమాచారం. మృతుల్లో ఇద్దరు రష్యా దౌత్యవేత్తలు కూడా ఉన్నట్లు తెలుస్తున్నది. ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

                                                     

About Author