PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఉరివేసుకొని వ్యక్తి ఆత్మహత్య…

1 min read

పల్లెవెలుగు వెబ్​, గడివేముల: మండల పరిధిలోని చిందు కుర్ గ్రామంలో ఆదివారం సాయంత్రం 4 గంటలకు ఎర్ర మట్టం వేణుగోపాల్ అనే వ్యక్తి ఇంట్లో ఎవరు లేని సమయంలో కొక్కానికి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు . మృతునికి గత సంవత్సరం రోడ్డు ప్రమాదంలో తలకు గాయం కావడంతో వైద్యం చేయించుకుటున్నట్టు ఆరోగ్యం కోలుకొక మానసిక స్థితి సరిగా లేక చనిపోతానని చెప్తుండే వాడని, జీవితం పై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకున్నట్టు భార్య ఎర్ర మఠం సువర్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఏఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపారు. మృతుడికి ఇద్దరు సంతానం.

About Author