PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఒకే స‌మ‌యంలో సూర్యాస్త‌మ‌యం, చంద్రోద‌యం.. ఎక్క‌డంటే ?

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఈ నెల 16వ తేదీన చైత్ర పౌర్ణమి వేడుకలు ఘనంగా జరుగనున్నాయి. ఆ రోజున కన్యాకుమారిలో ఓ అద్భుత దృశ్యం ఆవిష్కృతం కానుంది. ఒకే సమయంలో సూర్యస్తమయం, చంద్రోదయ దృశ్యాలు కనిపించనున్నాయి. ఈ అద్భుత దృశ్యం కన్యాకుమారితో పాటు ఆఫ్రికా దేశంలోని ఒక కొండ ప్రాంతంలో మాత్రమే కనిపిస్తుందని ఖగోళ శాస్త్రవేత్తలు తెలిపారు. అయితే, ఆ అపురూప దృశ్యాన్ని తిలకించేందుకు ఆఫ్రికాలోని ఆ కొండ ప్రాంతానికి ఎవ్వరూ వెళ్లలేని పరిస్థితి. దీంతో ఒక్క కన్నియాకుమారిలోనే ఈ అరుదైన దృశ్యం చూసేందుకు వీలవుతుంది. దీంతో పలు రాష్ట్రాల నుంచి భక్తులు కన్యాకుమారికి భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. వాస్తవానికి కన్యాకుమారి తీరంలో సూర్యోదయం, సూర్యాస్తమయం రెండూ చూడగలం. ఇప్పుడు సూర్యాస్తమయం, చంద్రోదయం కూడా ఒకే సమయంలో సాక్షాత్కరించనున్నట్లు శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.

                                

About Author