NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

సూపర్  సిక్స్ పథకాల హామీలను తక్షణమే  అమలుపరచాలి

1 min read

పి.రామచంద్రయ్య

అర్హులైన నిరుపేదలకు గ్రామాల్లో మూడు సెంట్లు పట్టణాల్లో రెండు సెంట్లు ఇంటి నిర్మాణానికి ఐదు లక్షలు మంజూరు చేయాలి డి.రాజా సాహెబ్

పత్తికొండ , న్యూస్​ నేడు : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదైనా అమలుకు నోచుకోని సూపర్ సిక్స్ తక్షణమే అమలు చేయాలని, అర్హులైన నిరుపేదలకు గ్రామాల్లో మూడు చెట్లు పట్టణాల్లో రెండు సెంట్లు పక్కా ఇంటికి ఐదు లక్షలు ఇచ్చి పేదల కలను సహకారం చేయాలని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ రాష్ట్ర సమితి పిలుపు మేరకు సోమవారం పత్తికొండలో స్థానిక చదువుల రామయ్య భవనం నుండి నాలుగు స్తంభాల వరకు ప్రదర్శన నిర్వహించారు. అనంతరం అక్కడ జరిగిన ధర్నాకు పట్టణ కార్యదర్శి రామాంజనేయులు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా హాజరైన సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పి. రామచంద్రయ్య. సిపిఐ మండల కార్యదర్శి డి. రాజా సాహెబ్ మాట్లాడారు.రాష్ట్రంలో డబల్ ఇంజన్ సర్కారు అని చెప్పబడుతున్న కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్న ఎన్నికల వాగ్దానాలు సూపర్ సిక్స్ పథకాలైన యువతకు ఉపాధి, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, ఉచిత సిలిండర్, ఉచిత బస్సు, మహిళా శక్తి అమలుకు నోచుకోలేదని  తీవ్రంగా విమర్శించారు.   అభివృద్ధి సంక్షేమం  పాలక ప్రభుత్వాలకు రెండు కళ్ళు లాంటివి అని జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో నిరుపేదలకు ఇంటి స్థలం పట్టణాల్లో సెంటు గ్రామాల్లో సెంటున్నర ఇచ్చి నిర్మాణానికి లక్ష 80 వేలు మాత్రమే ఇచ్చి అది కూడా ఊరికి దూరంగా కొండల్లో, వంకల్లో, ముంపు ప్రాంతాల్లో నివాసానికి యోగ్యం కానిచోట ఇచ్చారని, నేను అధికారంలోకి వస్తే గ్రామాల్లో మూడు సెంట్లు పట్టణాల్లో రెండు సెట్లు ఇంటి నిర్మాణానికి నాలుగు లక్షలు ఇస్తాం అన్న హామిలు అమలు చేయాలి తెలిపారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *