NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మాదిగ విద్యార్థి సమాఖ్య నియోజకవర్గ కన్వీనర్ గా సురేష్ ఎన్నిక..

1 min read

పల్లెవెలుగు వెబ్​, నందికొట్కూరు: మాదిగ విద్యార్థి సమాఖ్య నందికొట్కూరు నియోజక నూతన కమిటీని శనివారం జిల్లా నాయకులు స్వాములు అద్యక్షతన మాదిగ విద్యార్థి సమాఖ్య జిల్లా అధ్యక్షులు శివ నారాయణ ఆధ్వర్యంలో ఎన్నుకున్నారు. నియోజకవర్గ కన్వీనర్ గా సురేష్ ను సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నందికొట్కూరు ఎం ఆర్ పి ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో శివ నారాయణ, స్వాములు మాట్లాడుతూ ఎంఆర్ పిఎస్ వ్యవస్థాపకుడు మందా క్రిష్ణ మాదిగ పిలుపు మేరకు ఎస్ సి లలో వర్గీకరణ సాధనకై మాదిగ విద్యార్థి సమాఖ్య ను బలోపేతం చెయ్యడం కోసం అలాగే వచ్చే శీతాకాల సమావేశాల్లో ఎస్సి వర్గీకరణపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పై వత్తిడి తెచ్చి పోరాడాల్సిన సమయం వచ్చిందని వారు పిలుపునిచ్చారు. మాదిగ విద్యార్థులు సైనికుడిలా పనిచేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పై ఒత్తిడి తెచ్చే విధంగా పోరాడాలని వారు అన్నారు . మాదిగ విద్యార్థి సమాఖ్య నియోజక వర్గ కన్వీనర్ గా .సురేష్ మాదిగ, కో.కన్వీనర్ లు గా శివ ,శరత్ ,లను ఎన్నుకున్నారు. ఈకార్యక్రమంలో ఎంఎస్ఎఫ్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

About Author