NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రసాయనిక ఎరువుల అమ్మకం నిలిపివేత

1 min read

పల్లెవెలుగు వెబ్ మహానంది: మహానంది మండలం గఫారియా పెస్టిసైడ్స్ ఎరువుల దుకాణంలో రసాయనక ఎరువుల అమ్మకాలు నిలిపివేసినట్లు మహానంది మండల వ్యవసాయ అధికారి నాగేశ్వర రెడ్డి మంగళవారం పేర్కొన్నారు. షాప్ లో తనిఖీ చేయగా సరియైన అమ్మకపు రికార్డులతో పాటు ఫారం ఓ కి సంబంధించి అనుమతులు లేనందున 5 లక్షల 89 వేల రూపాయల విలువ గల 32.89 మెట్రిక్ టన్నుల రసాయనిక ఎరువుల అమ్మకాలను నిలుపుదల చేసినట్లు తెలిపారు. రైతులకు బిల్లులను ఫారం ఎం లో ఇవ్వాలని రైతులతో సంతకాలు కూడా తీసుకోవాలని అలా కాని పక్షంలో చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించినట్టు తెలిపారు.. అధిక ధరలకు రైతులకు ఎరువులను విక్రయిస్తే తమకు తెలియజేయాలని రైతులను కోరారు.

About Author