PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మాజీ సీఎం యడియూరప్ప మనవరాలు అనుమానాస్పద మృతి !

1 min read

పల్లెవెలుగువెబ్ : కర్ణాటక మాజీ సీఎం యడియూరప్ప మనవరాలు సౌందర్య అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. బెంగళూరులోని తన అపార్ట్ మెంట్ లో ఉరికి వేలాడుతూ కన్పించారు. సౌందర్య వైద్యురాలిగా ప్రాక్టీస్ చేస్తున్నారు. యడియూరప్ప పెద్ద కుమార్తె పద్మ కూతురు సౌందర్య. ఈమెకు రెండేళ్ల క్రితం వివాహం అయింది. భర్తీ నీరజ్ కూడ డాక్టరే. వీరికి ఆరు నెలల చిన్నారి ఉంది. సౌందర్య కుటుంబ కలహాలతో కొంతకాలంగా మానసిక ఒత్తిడికి గురవుతున్నట్టు తెలుస్తోంది. ఆమె ఆత్మహత్య చేసుకుని ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

        

About Author