NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పంచాయితీ రాజ్ కార్యాలయ ఆవరణలో స్వచ్ఛభారత్ కార్యక్రమం

1 min read

తడి చెత్త-పొడి-చెత్త వేరు చేయుటపై అవగాహన

స్వచ్ఛ ఆంధ్ర ప్రదేశ్ గా నా వంతు కృషి చేస్తాని ప్రమాణం

పంచాయతీరాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎం.వి రమణమూర్తి

పల్లెవెలుగు,ఏలూరుజిల్లా ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తలపెట్టిన స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగంగా ఏలూరు జిల్లా కలెక్టర్ కె వెట్రీ సెల్వి ఆదేశాల అనుసారం జిల్లాలో ప్రభుత్వ కార్యాలయాలు పరిశుభ్రత పచ్చదనం, తడిచెత్త,పొడిచెత్త కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దానిలో భాగంగా శనివారం పంచాయతీరాజ్  కార్యాలయ ఆవరణలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్  పర్యవేక్షణలో సిబ్బందితో చీపురు పట్టి పరిశుభ్రత పచ్చదన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యాలయంలో పాత ఫైళ్లను, షెల్ఫులను, పరిసరాలను శుభ్రపరిచి అందంగా తీర్చిదిద్దారు. కార్యాలయ పరిసర ప్రాంతాలను సిబ్బందితో కలిసి చీపురుతో ఊడ్చి శుభ్రం చేశారు. అనంతరం ప్రతిజ్ఞ చేస్తూ నేను నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని, నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదారం చేసి పరిశుభ్ర ఆంధ్ర ప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని, ఈరోజు పరిశుభ్రత గురించి నేను చేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ. ఈరోజు నుండి నాతోటి వారికి కూడా స్వచ్ఛత కొరకు తడి చెత్త, పొడి చెత్త వేరు చేయడం పై అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛ,ఆంధ్ర స్వర్ణాంధ్ర ప్రదేశ్ గా తీర్చిదిద్దేటట్లు మా వంతు కృషి చేస్తామని ప్రమాణం చేస్తున్నామని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ ఇఇ యం.వి రమణమూర్తి, పరిపాలన అధికారి జి సుజాత, ఏఇ పద్మజ,సీనియర్ అసిస్టెంట్ లు సత్యసాయిరాం, పణి, విజయ్ కుమార్, వాసు తదితర సిబ్బంది పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *