PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

గోదాగోకులాన్ని సందర్శించిన స్వామి శివరామానంద సరస్వతి

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూలు శివారులోని శ్రీగోదా గోకులం నందు వెలసిన శ్రీగోదా రంగనాయకి సమేత శ్రీ రంగనాథ స్వామివారిని స్వామి శివరామానంద సరస్వతి దర్శించుకున్నారు. ఆయనకు వేదపండితులు, ఆలయ నిర్వాహకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా స్వామీజీ మాట్లాడుతూ శ్రీరంగాన్ని తలపిస్తున్న ఈ క్షేత్రం అచిరకాలంలోనే గొప్ప ఖ్యాతిని పొందుతుందని అన్నారు. వీరు పూర్వాశ్రమంలో డాక్టర్ వి.శివరామకృష్ణారావు ప్రముఖ వైద్యులే కాకుండా బద్వేలు శాసనసభ్యులుగా పలుమార్లు ఎన్నికై, ఆ ప్రాంతానికి ఎన్నెన్నో సేవలు అందించారు. ప్రస్తుతం సన్యాసం స్వీకరించి ఋషీకేశ్ నందు ఉంటున్నారు. ఇటీవలే విగ్రహ ప్రతిష్టాపన జరిగిన శ్రీ గోదాగోకులాన్ని గురించి తెలుసుకుని స్వామి వారిని సేవించుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్ని సంపదలున్నా ఆధ్యాత్మిక సంపదకు ఏదీ సాటిరాదని, అటువంటి ఆధ్యాత్మిక తత్వాన్ని సమాజంలో వ్యాప్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గోదాగోకులం వ్యవస్థాపక చైర్మన్ మారం నాగరాజ గుప్త, మేనేజింగ్ ట్రస్టీ పల్లెర్ల నాగరాజు,వేదపండితులు రమేషాచార్యులు,రంగనాథాచార్యులు,వంశీకృష్ణమాచార్యులు, ఎస్.మహేశ్వరరెడ్డి, ఇల్లూరి రామయ్య,బాలసుధాకర్, పాలాది సుబ్రహ్మణ్యం, సురేశ్, ఆవొపా చీఫ్ అడ్వయిజర్ మలిపెద్ది నాగేశ్వరరావు, తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ కార్యనిర్వాహకులు డాక్టర్ మల్లు వేంకటరెడ్డితో పాటు గోదాగోకులం పరివారం సభ్యులు పాల్గొన్నారు.

About Author