NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఏబీవీపీ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతి

1 min read

పల్లెవెలుగు వెబ్ కౌతాళం: కౌతాళం మండలంలో కార్యక్రమం నిర్వహించగా  అఖిలా భారతీయ విద్యార్థి పరిషత్ వీరి ఆధ్వర్యంలో స్వామి వివేకానంద  జయంతి  సందర్భంగా కౌతాళం ఉన్నత పాఠశాల  లో జాతీయ యువజన దినోత్సవం ను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కౌతాళం ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఇమ్మానియేల్ , ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్  సంతోష్ కుమార్  ఉపాధ్యాయులు, ABVP  కౌతాళం టౌన్ ప్రెసిడెంట్ శివాజీ,  మండల కన్వీనర్ అశోక్ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. నేడు ఆధునిక ప్రపంచంలో యువత కీలకంగా ఉండాలి. నేటి యువత స్వామి వివేకానందని ఆదర్శంగా తీసుకొని   విద్యలోనూ తల్లిదండ్రుల పట్ల అంకితభావంతో మెలగాలని ఈ సందర్భంగా తెలియజేశారు.  ఈ కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు పరశురాం, వినోద్, శివ ,అంజి, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

About Author