PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఓటర్లలో చైతన్యంకోసం స్వీప్..

1 min read

రాబోయే ఎన్నికల్లో అన్ని ప్రాంతాల్లో ఓటింగ్‌శాతాన్ని పెంచి..

ప్రజ లు స్వేచ్ఛాయుత వాతావరణంలో, నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకునేలా చైతన్య కార్యక్రమాలు..

జిల్లాలో పోలింగ్ 92 శాతం పెంచే లక్ష్యంగా అవగాహన కార్యక్రమాలు..

45 రోజులపాటు ముమ్మరంగా స్వీప్ కార్యక్రమాలు..

జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్

పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : జిల్లాలో రాబోయే ఎన్నికల్లో అన్ని ప్రాంతాల్లో ఓటింగ్‌శాతాన్ని పెంచి ప్రజలు స్వేచ్ఛాయుత వాతావరణంలో, నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకునేలా రానున్న 45 రోజులపాటు ముమ్మరంగా స్వీప్ చైతన్య కార్యక్రమాలను నిర్వహించేందుకు కార్యాచరణ సిద్ధం చేశామని జిల్లా కలెక్టర్, జిల్లా ప్రధాన ఎన్నికల అధికారి వె. ప్రసన్న వెంకటేష్ చెప్పారు.  స్ధానిక కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో గురువారం  ‘సిస్టమాటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ & ఎలక్ట్రోల్ పార్టిసిపేషన్’ (SVEEP) కార్యకలాపాలు & స్వీప్ 2024 జిల్లా కార్యాచరణ ప్రణాళిక అమలుపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో జిల్లాకలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా స్వీప్ కార్యక్రమాలకు సంబంధించి రూపొందించిన యూట్యూబ్, ఇన్ స్ట్రాగ్రామ్ తదితర సోషల్ మీడియా మాథ్యమాలను కలెక్టర్ ఆవిష్కరించారు.  అనంతరం ఓటర్లను చైతన్యపరిచేందుకు అవగాహన పరిచే పలు గోడపత్రికలను కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ విడుదల చేశారు. అనంతరం  కలెక్టర్ వె.ప్రసన్న వెంకటేష్ మాట్లాడుతూ జిల్లాలో ఓటర్ టర్నోవర్ ఇప్లిమెంటేషన్ ప్లాన్ రూపొందించుకొని దానిని క్షేత్రస్ధాయిలో పటిష్టంగా అమలు చేయాలన్నారు.  జిల్లాలో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో 90 నుంచి 92 శాతం పోలింగ్ నమోదయ్యే విధంగా అన్ని ప్రయత్నాలు చేస్తున్నామన్నారు.  ఇందుకు పటిష్టమైన ప్రణాళికను రూపొందించిన స్వీప్ నోడల్ అధికారి, డిపివో తూతిక శ్రీనివాస్ విశ్వనాథ్ ను కలెక్టర్ ఈ సందర్బంగా అభినందించారు.  గత ఎన్నికల్లో జిల్లా సగటు ఎన్నికల పోలింగ్ 86 శాతం నమోదైయిందని ఏలూరు అర్బన్ ప్రాంతంలో 69.02 శాతం నమోదయిందన్నారు.  దీనిని దృష్టిలో పెట్టుకొని ఏలూరు అర్బన్ తోపాటు నూజివీడు, చింతలపూడి, జంగారెడ్డిగూడెం, ప్రాంతాల్లోకూడా ఓటర్ టర్నవుట్ పెంపు లక్ష్యంగా అన్ని ప్రయత్నాలు చేయాలన్నారు.  ప్రతి నియోజకవర్గంలో గతఎన్నికల్లో నమోదైయిన సగటు శాతాన్ని 3 విభాగాలుగా విభజించుకొని ఆదిశగా ఎక్కడైతే పోలింగ్ శాతం తక్కువగా నమోదయిందో అందుకు గల కారణాలను విశ్లేషించాలన్నారు.  దానికి అనుగుణంగా నియోజకవర్గంలో ఓటర్ టర్నోవర్ ఇప్లిమెంటేషన్ ప్లాన్ ను అమలు చేయాలన్నారు.  విభిన్న ప్రతిభావంతులు నూరుశాతం ఓటు వినియోగించుకునేలా, వృద్ధాశ్రమంలో వున్నవారు ట్రాన్స్ జండర్స్ లను గుర్తించి వారు ఓటుహక్కు వినియోగించుకునేందుకు అవసరమైన ఏర్పాట్లను ఎఆర్ఓలు పర్యవేక్షించాలన్నారు. వయోవృద్ధులు, నడవలేనిపరిస్ధితుల్లో ఉన్నవారు, తదితరులకోసం హోం ఓటింగ్ అమలుచేసేందుకు ఎన్నికల కమీషన్ సన్నాహాలు చేస్తున్నదని ఇందుకు సంబంధించిన ఇందుకు సంబంధించిన నిబంధనలు అందిన వెంటనే వాటిని తెలియజేయడం జరుగుతుందన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన 5 రోజులలోపు సంబంధిత పోస్టల్ బ్యాలెట్ కు ధరఖాస్తు చేసుకోవల్సియుంటుందన్నారు.స్వీప్ కార్యక్రమంలో బాగంగా చునావ్ పాఠశాల కార్యక్రమాన్ని 3 రోజులపాటు సంబంధిత ఎఇఆర్ఓలు నిర్వహించాలన్నారు.  క్యాంపస్ అంబాసిడర్లతో ఆయా నియోజవర్గ రిటర్నింగ్ అధికారులు సమావేశాలు నిర్వహించాలని వారికి కూడా ఈవిఎంలపై అవగాహన కలిగించాలన్నారు.  పరీక్షలకు ముందుగానే పాఠశాలల్లో, కళాశాలల్లో స్వీప్ కార్యక్రమాలను నిర్వహించాలన్నారు.  స్వీప్ కార్యక్రమాల్లో ముఖ్యంగా మారుమూల ప్రాంతాల్లో అవగాహన కలిగించే కార్యక్రమాలను నిర్వహించాలన్నారు.  ఇంతవరకు ఆయా నివాసిత ప్రాంతాలను సందర్శించని ప్రాంతాలను ఎంపిక చేసుకొని అక్కడ ఆర్ఓ, ఎఇఆర్ఓ, తహశీల్దార్లు, ఎంపిడిఓలు ఓటర్ల చైతన్య కార్యక్రమాలను నిర్వహించేందుకు కార్యచరణ తయారు చేసుకోవాలన్నారు.  స్వీప్ కార్యక్రమాల్లో కేంద్రప్రభుత్వ శాఖల అధికారులను కూడా భాగస్వామ్యంచేయాలని కలెక్టర్ సూచించారు.  ప్రజా స్వామ్యంలో మనహక్కుల సాధనకు ఏవిధంగా పోరాడతామో అదే విదంగా ఓటుహక్కు వినియోగించుకోవడం కూడా బాధ్యతగా తీసుకోవాలన్నారు.  ఎన్నికల్లో వినియోగించే ఈవిఎంల పై ఎటువంటి సందేహాలకు తావులేదని కలెక్టర్ స్పష్టం చేశారు.  ఈవిఎంల నిర్వహణపై వివిధ దశల్లో తనిఖీలతోపాటు పలుమార్లు ర్యాండమైజేషన్ ద్వారా పోలింగ్ కేంద్రాలకు చేర్చబడతాయన్నారు.  ఐటిడిఎ పివో యం. సూర్యతేజ మాట్లాడుతూ ఐటిడిఎ పరిధిలో ఓటర్ టర్నవుట్ పెంచేందుకు అన్ని చర్యలు తీసుకుంటామన్నారు.  ఓటర్లు వారి అభిష్టంమేరకు ప్రశాంతంగా సజావుగా తమఓటుహక్కు వినియోగించుకునేలా స్వీప్ కార్యక్రమాలను అమలు చేస్తామన్నారు.  విద్యార్ధుల బాగస్వామ్యం స్వీప్ కార్యక్రమాల్లో ఎంతో అవసరమని వారి ద్వారా అన్ని ప్రాంతాలకు సంబంధిత సమాచారం చేరే అవకాశం వుంటుందన్నారు.   డిఆర్ డిఏ పిడి డా. ఆర్. విజయరాజు మాట్లాడుతూ జిల్లాలో 30 రోజుల పాటు ఈవిఎంల పస్ట్ లెవల్ చెకింగ్ రాజకీయ పక్షాల ప్రతినిధుల సమక్షంలో బెల్ ఇంజనీర్లు తనిఖీ చేయడం జరిగిందన్నారు.  నామినేషన్ల ముందు ఒకసారి, గుర్తులు కేటాయించబడిన అనంతరం ర్యాండమైజేషన్ నిర్వహించడం జరుగుతుందన్నారు.  పోలింగ్ కు ముందు కూడా మాక్ పోల్ నిర్వహిస్తారని అదే విదంగా ఏదైనా సందేహాలు ఉంటే టెస్ట్ ఓటింగ్ ద్వారా కూడా ఈవిఎంల పనితీరును పరిశీలించేందుకు అవకాశం ఉందన్నారు.  ఈ సందర్బంగా జిల్లాలో మార్చి 31వరకు నిర్వహించే స్వీప్ కార్యక్రమ కార్యచరణ వివరాలు డిపివో,స్వీప్ నోడల్ అధికారి శ్రీనివాస్ విశ్వనాథ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. కార్యక్రమంలో జిల్లా రెవిన్యూ అధికారి డి. పుష్పమణి, జంగారెడ్డిగూడెం ఆర్డిఓ అద్దయ్య, డిఇఓ అబ్రహాం, వివిధ శాఖల జిల్లా అధికారులు, ఎంపిడివోలు, తహశీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.

About Author