PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఉద్యోగుల‌కు తీపి క‌బురు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్: దసరా పండుగ వేళ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మోదీ సర్కార్ తీపి కబురు చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు 4 శాతం కరువుభత్యం పెంచుతున్నట్టు ప్రకటించింది. 2022 జూలై 1 నుంచి ఈ పెంపు అమలు చేస్తారు. ఇందువల్ల 47.68 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 68.62 లక్షల మంది పెన్షనర్లకు ప్రయోజనం చేకూరుతుంది. పెంచిన డీఏతో ప్రభుత్వంపై రూ.6,591.36 కోట్ల అదనపు భారం పడుతుంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ కమిటీ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ సమావేశంలో ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నట్టు మంత్రి అనురాగ్ ఠాకూర్ బుధవారం మీడియాకు తెలిపారు.

                                      

About Author