PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఏపీ దేవాదాయ అర్చకులకు తీపికబురు..25శాతం వేతనం పెంపు!

1 min read

పల్లెవెలుగువెబ్​, అమరావతి: రాష్ట్ర దేవాదాయశాఖ అర్చకులకు ప్రభుత్వం తీపికబురు చెప్పింది. ఈమేరకు ఏపీ సీఎం జగన్​ రాష్ట్రంలోని దేవాదాయ అర్చకులకు 25శాతం వేతనం పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్​ వెల్లడించారు. మంగళవారం సీఎం జగన్​ దేవాదాయశాఖపై జరిపిన ప్రత్యేక సమీక్ష జరిపినట్లు తెలిపారు. దేవాలయాల్లో అర్చకుల నియామకాలు వంశపారంపర్య ప్రాతిపదికన చేపట్టనున్నట్లు చెప్పారు. కాగా అర్చకుల వేతనాలను గతేడాది పెంచిన విషయం తెలిసిందే. ఇందులో కేటగిరి–1 దేవాలయాల్లో పనిచేసే అర్చకులకు రూ.10వేల నుంచి రూ.15,625కు పెంచగా కేటగిరి–2 ఆలయాల్లో పనిచేసే అర్చకస్వాములకు రూ.5వేల నుంచి రూ.10వేలకు పెంచారు. కాగా మరోసారి సదరు వేతనాలను మరో 25శాతం పెంచుతున్నట్లు మంత్రి వెల్లడించారు.

About Author