PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నారాలోకేష్​ను కలిసిన టి.జి. భరత్​

1 min read

 పల్లెవెలుగు వెబ్​: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను బుధవారం  కర్నూలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి టి.జి భరత్ మర్యాదపూర్వకంగా కలిశారు.  విజయవాడలో పార్టీ యువనేతలతో  ఆయన.. నారాలోకేష్​కు పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం నారాలోకేష్​ త్వరలో చేపట్టబోయే పాదయాత్ర గురించి చర్చించారు. ఈ సందర్భంగా పలు సలహాలు, సూచనలు నారాలోకేష్​కు ఇచ్చినట్లు టీజీ భరత్​ పేర్కొన్నారు. ఆ తరువాత పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును కలిశారు.

About Author