NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఉరికొయ్యలకు వేలాడే రైతు శవాలు కనిపించడం లేదా?: రేవంత్‌రెడ్డి

1 min read


పల్లెవెలుగు వెబ్: టీ-పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి సీఎం కేసీఆర్‌పై ఫైర్ అయ్యారు. తెలంగాణలో రైతులు కోటీశ్వరులయ్యారు అని సీఎం వ్యాఖ్యానించడంపై మండిపడ్డారు. కేసీఆర్ బుద్ధిలేకుండా మాట్లాడుతున్నాడని..ఉరికొయ్యలకు వేలాడే రైతు శవాలు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. అనాథలైన రైతు కుటంబాల ఆర్తనాధాలు వినించడం లేదా? అని నిలదీశారు. అధికారపు పొరలు కమ్మి కేసీఆర్ కంటి చూపు మందగించిందా అని రేవంత్ ఎద్దేవా చేశారు. కాగా, అప్పులు తీర్చలేక బలవన్మరణానికి పాల్పడిన ముగ్గరు రైతుల వివరాలను రేవంత్ ట్వీట్ చేసి ప్రభుత్వ తీరును ఎండగట్టారు.

About Author