PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

క్రికెట్ పోటీల్లో మొదటి విజేతగా తడకనపల్లె -2వ విజేతగా చింతలపల్లె

1 min read

పల్లెవెలుగు వెబ్ మిడుతూరు: మిడుతూరు మండల పరిధిలోని చింతలపల్లె గ్రామంలో ఉగాది పండుగ సందర్భంగా మార్చి 20వ తేదీ ప్రారంభమైన ఉమ్మడి జిల్లా స్థాయి క్రికెట్ ఆటల పోటీల్లో తడకనపల్లె గ్రామానికి చెందిన జట్టు మొదటి విజేతగా నిలిచిందని ఈజట్టుకు 20వేలు,రెండవ విజేత చింతలపల్లె 15వేలు,మూడవ విజేత నందికొట్కూరు 10వేలు,నాలుగవ విజేత దామగట్ల 5వేలు గెలుపొందిన జట్టు సభ్యులకు గ్రామ నాయకులు నీల కంటేశ్వర రెడ్డి,మల్లేశ్వర రెడ్డి,రామకృష్ణారెడ్డి బహుమతులను అందజేసినట్లు కమిటీ ఆర్గనైజర్లు సోమశేఖర్ రెడ్డి,కోటేశ్వర్ రెడ్డి,దశరథరెడ్డి,సురేష్ తెలిపారు.జరిగిన ఈ ఆటల పోటీల్లో మొత్తం 48 జట్లు పాల్గొన్నాయని వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల క్రీడాకారులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.

About Author