NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

తాడిపత్రి చైర్మన్​​ పదవిపై ఉత్కంఠ..!

1 min read
కౌన్సిలర్లతో జేసీ ప్రభాకర్​ రెడ్డి

కౌన్సిలర్లతో జేసీ ప్రభాకర్​ రెడ్డి

జేసీ క్యాంపు లో 20 మంది కౌన్సిలర్లు..
తాడిపత్రి; మున్సిపల్​ చైర్మన్​ పదవి దక్కించుకోడానికి.. ప్రధాన పార్టీలలో ఉత్కంఠత నెలకొంది. బుధవారం తెలుగుదేశం పార్టీ, ఇండిపెండెంట్, సిపిఐ కౌన్సిలర్ల తో తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, జేసీ పవన్ రెడ్డి రహస్య ప్రాంతంలో రిసార్టులో బస చేశారు. ఈ సందర్భంగా రిసార్టులో ఉన్నవారితో కలసి సరదాగా ఫోటో దిగారు. టీడీపీ క్యాంపులో ఒక స్వతంత్ర, ఒక సిపిఐ అభ్యర్థితో కలిపి 20 మంది కౌన్సిలర్లు ఉన్నారు. మున్సిపల్ చైర్మన్ పదవి దక్కాలంటే..19 మంది కౌన్సిలర్లు అవసరం. అటు వైసిపికి ఎక్స్ అఫిషియో సభ్యులతో కలిపి 18 సంఖ్యా బలం ఉంది.

About Author