PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

తగ్గేదే లే..

1 min read

సినిమా డెస్క్​ : నార్త్‌, సౌత్‌ తేడా లేకుండా వరుస ప్రెస్టీజియస్‌ ప్రాజెక్ట్స్‌తో యమ బిజీగా ఉంది పూజా హెగ్డే. తాజాగా మరిన్ని సినిమాలకు కమిట్​మెంట్‌ ఇస్తున్నట్లుగా తెలుస్తోంది. దీన్ని బట్టి పూజా డిమాండ్‌ ఏ లెవల్లో ఉందో అర్థమవుతోంది. ఓ పక్క తెలుగులో అఖిల్‌తో నటించిన ‘మోస్ట్ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌‌’ రిలీజ్‌కి రెడీగా ఉంది. ఆచార్య, రాథేశ్యామ్‌ చిత్రాల్లో తన పార్ట్‌ చిత్రీకరణ పూర్తయ్యింది. మరోపక్క తమిళంలో విజయ్‌ సరసన ‘బీస్ట్‌’ మూవీ చిత్రీకరణలో పాల్గొంటోంది. ఇప్పుడు ధనుష్​తో శేఖర్‌‌ కమ్ముల సినిమాలో పూజని హీరోయిన్‌గా ఎంపిక చేశారని తాజా సమాచారం. ఈ మూవీలో ఇద్దరు హీరోయిన్‌లు ఉంటారని, ఇద్దరివీ ఇంపార్టెంట్‌ రోల్స్‌ అని, అందుకే పూజాని సెలెక్ట్‌ చేశారని అంటున్నారు. శేఖర్‌‌ కమ్ముల సినిమా అంటేనే కథ మొత్తం హీరోయిన్‌ చుట్టూనే తిరుగుతుంది. మరి ఇద్దరు హీరోయిన్లు అంటే స్టోరీ ఏ రేంజ్‌లో ఉంటుందో. అయితే అఫీషియల్‌గా ఇంకా కన్​ఫమేషన్‌​ రావాలి. ఇక ఎన్టీఆర్‌‌ నటిస్తున్న ‘ఆర్ఆర్‌‌ఆర్‌‌’ మూవీ నెక్ట్స్‌ కొరటాల శివ సినిమా చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ మూవీలో కూడా ఇద్దరు హీరోయిన్స్‌ ఉంటారని టాక్. ఒక హీరోయిన్‌గా కియార అద్వానీని అనుకుంటున్నారని, మరో హీరోయిన్‌గా పూజని అనుకుంటున్నారన్న టాక్‌ నడుస్తోంది. మరోవైపు వక్కంతం వంశీ హీరో నితిన్‌తో సినిమా చేస్తున్నాడు. ఇందులో కూడా పూజానే హీరోయిన్‌ అనుకుంటున్నారట. డైరెక్టర్‌‌కి పూజా నటనపై మక్కువ ఎక్కువ అని, అందుకే బడ్జెట్‌ లెక్కచేయకుండా తన సినిమాలో పూజనే హీరోయిన్‌గా తీసుకోవాలనుకుంటున్నాడట. ఇంకా బాలీవుడ్‌లో సర్కస్, భాయిజాన్‌ మూవీల్లో నటిస్తోంది. ఇలా అమాంతంగా పెరిగిపోయిన పూజా డిమాండ్‌ ఇప్పట్లో తగ్గేలా లేదుగా!

About Author