PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పోలింగ్ స్టేషన్లను పరిశీలించిన తాసిల్దార్.. ఎస్ఐ

1 min read

పల్లెవెలుగు వెబ్ మహానంది:  రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని  మండలంలోని వివిధ గ్రామాల్లో ఉన్న పోలింగ్ స్టేషన్లను తాసిల్దార్ జనార్ధన్ శెట్టి మరియు ఎస్ఐ నాగేంద్రప్రసాద్ బుధవారం పరిశీలించారు. ఆయా గ్రామాల్లోని పాఠశాలల్లో ఉన్న పోలింగ్ కేంద్రాల్లో వసతులను పరిశీలించి కొన్ని సూచనలు చేశారు. ప్రతి పోలింగ్ స్టేషన్ కు విధిగా పోలింగ్ స్టేషన్ నెంబరు గోడపై రాయడంతో పాటు విద్యుత్తు మరియు ఇతర మౌలిక సదుపాయాలు ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేసి నివేదిక అందజేయనున్నట్లు తాసిల్దార్ జనార్ధన్ శెట్టి పేర్కొన్నారు. వారి వెంట ఏఎస్ఐ రామకృష్ణ ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

About Author