NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

జాతీయ మేగా లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోండి

1 min read

రాజీమార్గమే రాజ మార్గము: ఎస్సై తిమ్మారెడ్డి
పల్లెవెలుగు వెబ్ గోనెగండ్ల: ఈ నెల 11వ తేదీ వరకు జరిగే జాతీయ మెగా లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకొని కేసుల్లో పరస్పరం రాజీ అయ్యి ప్రశాంతంగా ఉండాలని గోనెగండ్ల ఎస్సై తిమ్మారెడ్డి అన్నారు. మండల కేంద్రమైన గోనెగండ్ల లోని స్థానిక పోలీస్ స్టేషన్లో కేసుల రాజుకి సంబంధించి కౌన్సిలింగ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై తిమ్మారెడ్డి మాట్లాడుతూ వివిధ కారణాలతో గొడవలు పడి పరస్పరం కేసులు పెట్టుకున్న వారు సంవత్సరాల తరబడి కోర్టుల చుట్టూ తిరుగుతూ ఇబ్బందులు కు గురికాకుండా జాతీయ లోక్ అదాలత్ ద్వారా రాజి అయ్యి సమస్యలను పరిష్కరించుకొని సత్వర పరిష్కారం పొంది కుటుంబాలతో సంతోషంగా గడపాలని, రాజి మార్గమే రాజమార్గం అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏ ఎస్ ఐ వెంకటేశ్వర్లు, కానిస్టేబుల్ లు మురారి, లక్ష్మీనారాయణ, మారెప్ప,వీరేష్ గౌడ్ ,వెంకటేష్, రమణ తదితరులు పాల్గొన్నారు.

About Author