PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

దివ్యాంగులు సద్వినియోగం చేసుకోండి..

1 min read

– జేసీ( ఆసరా & వెల్ఫేర్​) ఎంకేవీ శ్రీనివాసులు
– దివ్యాంగులకు ఉద్యోగ నియామకపత్రం అందజేత
పల్లెవెలుగు వెబ్​, కర్నూలు: వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న దివ్యాంగ పోస్టుల భర్తీకి జిల్లా విభిన్న ప్రతిభావంతులు హిజ్రాల, వయోవృద్దుల సంక్షేమం శాఖ చర్యలు చేపట్టింది. అందులో భాగంగా మెడికల్ కళాశాలలో జానియర్ అసిస్టెంట్ గా ఎంపికైన దివ్యాంగురాలు హైమావతికి, పశుసంవర్ధక శాఖలో ఆఫీస్ సబర్డినేట్ గా ఎంపికైన దివ్యాంగ అభ్యర్థి లక్ష్మన్నకు, జానియర్ స్టేనోగా సరళకు సోమవారం ఏడి విజయ , జిల్లా జాయింట్ కలెక్టర్( ఆసరా వెల్ఫేర్ )ఎం కె వి శ్రీనివాసులు నియామక పత్రం అందజేశారు.

అనంతరం జెసి మాట్లాడుతూ విభిన్న ప్రతిభావంతుల సంక్షేమం, అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందన్నారు. వీరి కోసం ప్రభుత్వం చెప్పట్టే సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. తమ కోటాలో నియామకమైన ఉద్యోగులు విధుల పట్ల అంకితభావంతో పనిచేయాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో విభిన్న ప్రతిభావంతులు హిజ్రాల, వయోవృద్దుల సంక్షేమం శాఖ సూపరింటెండెంట్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

About Author