PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జాతీయ లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోండి

1 min read

జిల్లా 5 వ అదనపు జడ్జి లక్ష్మి
పల్లెవెలుగు వెబ్​, రాయచోటి: రాజీ మార్గం ద్వారా కేసులను పరిష్కరించే లక్ష్యంతో అత్యున్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు సెప్టెంబర్ నెల 11వ తేదీన జరిగే జాతీయ లోక్ అదాలత్ ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని గురువారం జిల్లా 5 వ అదనపు జడ్జి లక్ష్మి ఒక ప్రకటనలో తెలిపారు. జాతీయ లోక్ అదాలత్ లో భాగంగా రాయచోటి కోర్టు పరిధిలోని కక్షిదారులు రాజీ మార్గం ద్వారా క్రిమినల్,సివిల్,ప్రమాద కేసులను పరిష్కరించుకోవాలని సూచించారు.అలాగే న్యాయవాదులు,పోలీసు అధికారులు వివిధ రకాల కేసుల లోని ఇరువర్గాల కక్షిదారులకు అవగాహన కల్పించి అత్యధిక కేసులు రాజీ మార్గం ద్వారా పరిష్కారం అయ్యేలాచర్యలు తీసుకోవాలన్నారు.

About Author