PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

‘ట్రాన్స్​ జెండర్స్​​’ కేంద్ర సాయం సద్వినియోగం చేసుకోండి

1 min read

– ఏడీ విజయ
పల్లెవెలుగు కర్నూలు: కరోన కష్టకాలంలో ట్రాన్స్​జెండర్స్​ను ఆదుకునేందుకు సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వశాఖ, భారత ప్రభుత్వము వారు రూ.1500 ఆర్థిక సాయం ప్రకటించిందని విభిన్న ప్రతిభ వంతులు, హిజ్రాల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ అసిస్టెంట్​ డైరెక్టర్​, జిల్లా మేనేజర్​ పి. విజయ తెలిపారు. బుధవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక సాయం కొరకు.. http://www.nisd.gov.in అను వెబ్సైట్ నందు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఈ అవకాశమును జిల్లాలోని ట్రాన్స్ జెండర్స్ అందరు సద్వినియోగం చేసుకోవాలని, ఈ నెలాఖరి (31.05.2021)లోపు ఆన్​లైన్ దరఖాస్తు చేసుకోవాలని ఏడీ విజయ వెల్లడించారు.

About Author