PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మోదీజీ.. లేత రంగు క‌ళ్లద్దాలు తీసేయండి..!

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: దేశంలో క‌రోన కేసులు, మ‌ర‌ణాలు పెరుగుతున్న సంద‌ర్భంలో .. ప్రజ‌ల మౌలిక స‌దుపాయాల మీద ఖ‌ర్చు పెట్టకుండా.. పార్లమెంట్, ప్రధాని నివాసాల‌కు వేల కోట్లు ఖ‌ర్చు చేయ‌డాన్ని కాంగ్రెస్ నేత రాహుల్ విమ‌ర్శిస్తున్నారు. ట్విట్టర్ లో సెటైరిక‌ల్ గా విమ‌ర్శలు చేస్తున్నారు. మోదీ లేత‌రంగు క‌ళ్లద్దాలు తీసి చూస్తే.. ప్రజ‌లు కోవిడ్ తో ఎలా ఇబ్బందిప‌డుతున్నారో తెలుస్తుంది అంటూ ఎద్దేవా చేశారు. రంగు క‌ళ్లద్దాలు తీయ‌కుంటే.. సెంట్రల్ విస్టా భ‌వ‌నం త‌ప్ప మ‌రొక్కటి క‌న‌ప‌డ‌దంటూ వ్యాఖ్యానించారు. కోవిడ్ మ‌ర‌ణాలు పెరిగిపోతున్నాయ‌ని, ప్రజ‌లు ఆస్పత్రుల ముందు క్యూలో నిలుచుంటున్నార‌ని .. ఆక్సిజ‌న్ అంద‌క వంద‌ల ప్రాణాలు గాల్లో క‌లిసిపోతున్నాయ‌ని రాహుల్ అన్నారు. సెంట్రల్ విస్టా భ‌వ‌నం కోసం చేసే ఖ‌ర్చు, వైద్య స‌దుపాయాలు మెరుగుప‌రిచేందుకు ఖ‌ర్చు చేయాల‌ని రాహుల్ ప్రధాని మోదీని కోరారు.

About Author