PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మంజూరైన వంతెన నిర్మాణం చేపట్టండి…జంపాన

1 min read

పల్లెవెలుగు వెబ్ ఉయ్యూరు: కృష్ణాజిల్లా తోట్లవల్లూరు మండలం తోట్లవల్లూరు – పాముల్లంక మద్య కృష్ణనదిపాయపై‌  వంతెన నిర్మాణం కొరకు అప్పటి ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి,, ది .పిబ్రవరి5 2014 న రూ.13.5.కోట్ల రూపాయలు మంజూరు కాబడి, శంకుస్థాపన కూడా ‌జరిగిందిఅని, సామాజిక కార్యకర్త జంపాన శ్రీనివాస్ గౌడ్ ఒక ప్రకటనలో తెలియజేశారు. సెప్టెంబర్ 2022లో ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశం మేరకు ఈ వంతెన నిర్మాణనికి పంచాయితీ రాజ్ మరియు గ్రామీణాఅభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి 31.50కోట్లరూపాయలు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ జారీచేసినప్పటికి వంతెన నిర్మాణం కానందున ఈవంతెన నిర్మాణం తోట్లవల్లూరు మండలం లోని చుట్టుప్రక్కలలంక గ్రామాలకు ఎంతో ఉపయోగకరమైనందున వంతెన నిర్మాణానికి పంచాయితీరాజ్  రాజ్ శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్ తగు చర్యలు తీసుకోగలందులకు జిల్లా కలెక్టర్ కి “స్పందన”లో వినతిపత్రం సమర్పించామని సామాజిక కార్యకర్త జంపాన శ్రీనివాస్ గౌడ్ ఒక ప్రకటనలో తెలియజేశారు.

About Author