PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప్రాణం తీసిన.. ఈత సరదా..!

1 min read
వంశీ (ఫైల్​)

వంశీ (ఫైల్​)

పల్లెవెలుగు వెబ్​, ఓర్వకల్లు : వేసవి తాపం తాళలేక… సరదా కోసం ఈతకెళ్లిన ఓ బాలుడు ప్రాణం పోగొట్టుకున్నాడు. ఈ ఘటన ఓర్వకల్లు మండలం హుసేనాపురంలో ఆదివారం చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. హుసేనాపురం గ్రామానికి చెందిన వంశీ (15) అనే బాలుడు తోటి మిత్రులతో కలిసి బావిలో ఈత కోసం వెళ్లాడు. బావిలోకి పల్టీ (కొర్రు) కొట్టిన వంశీ .. ఎంత సేపటికీ బయటకు రాకపోవడంతో ఆందోళన చెందిన గ్రామస్తులు, తోటి మిత్రులు సహాయక చర్యలు చేపట్టారు. బావిలో 30 అడుగుల మేర నీరు ఉండటంతో మోటార్ల ద్వారా నీటిని బయటకు తోడారు. సాయంత్రం 6 గంటల సమయంలో మృతదేహాన్ని వెలికి తీశారు. హుసేనాపురం పాఠశాలలో 9 వ తరగతి చదువుతున్న వంశీకి… తల్లిదండ్రులు, అక్క, చెల్లి ఉన్నారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

About Author